కోహ్లీ జట్టులోకి తిరిగి చేరుతున్న నేపథ్యంలో తుది జట్టులో ఎవర్ని ఉంచాలి..? ఎవర్ని తొలగించాలి..? అనే విషయమ్మీద సందిగ్దత నెలకొంది. కాన్పూర్ టెస్టులో సెంచరీ, హాఫ్ సెంచరీతో ఇరగదీసిన శ్రేయస్ అయ్యర్ ను పక్కనబెడతారని వాదనలు వినిపిస్తున్నాయి. ఇదే సమయంలో ఫామ్ లో లేని వైస్ కెప్టెన్ రహానే, ఛతేశ్వర్ పుజారాలలో ఒక్కరిని తప్పించాలని కూడా పలువురు సీనియర్లు అభిప్రాయపడుతున్నారు.