అయితే, ఇంగ్లాండ్ సిరీస్ కు మహ్మద్ సిరాజ్, జస్ప్రీత్ బుమ్రా అందుబాటులో ఉంటారు. భారత్ లో టెస్టు సిరీస్ జరుగుతుండటంతో ఇక్కడ ఫాస్ట్ బౌలర్ల కంటే స్పిన్నర్లకే ప్రాధాన్యం ఇస్తున్నారు. టీం ఇండియా ముగ్గురు స్పెషలిస్ట్ స్పిన్నర్లను ఎంపిక చేయడంతో ఫాస్ట్ బౌలింగ్ గురించి పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కూడా సంబంధిత వర్గాలు పేర్కొంటున్నాయి. ఇదే క్రమంలో అఫ్గానిస్థాన్ తో మూడు మ్యాచ్ ల సిరీస్ నుంచి సిరాజ్, బుమ్రాలకు విశ్రాంతినిచ్చి టెస్టు క్రికెట్ కు సిద్ధం కావాలని బీసీసీఐ కోరిందని సమాచారం.