INDvsENG: ముగిసిన రెండో రోజు ఆట... భారీ ఆధిక్యంలో టీమిండియా... మూడో రోజు ఆటలో...

First Published Feb 14, 2021, 4:55 PM IST

ఇంగ్లాండ్‌తో తొలి టెస్టులో ఓడిన టీమిండియా, రెండో టెస్టులో విజయం దిశగా అడుగులు వేస్తున్నట్టే అనిపిస్తోంది. రెండో రోజు ఆట ముగిసే సమయానికి వికెట్ నష్టానికి 54 పరుగులు చేసిన టీమిండియా, ఇంగ్లాండ్ కంటే 249 పరుగుల భారీ ఆధిక్యం ఉంది. ఇంకా మూడు రోజుల ఆట మిగిలే ఉండడంతో చెన్నై టెస్టు ఆసక్తికరంగా మారింది.

ఇంగ్లాండ్‌తో జరుగుతున్న రెండో టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో భారత జట్టు 42 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయింది. యంగ్ బ్యాట్స్‌మెన్ శుబ్‌మన్ గిల్ ఓ సిక్స్‌తో 14 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు. శుబ్‌మన్ గిల్, రోహిత్ శర్మ ఇద్దరూ దూకుడుగా ఇన్నింగ్స్ ప్రారంభించడంతో మొదటి 11 ఓవర్లలోనే 42 పరుగులు వచ్చాయి.
undefined
అయితే వేగంగా ఆడేందుకు ప్రయత్నించిన శుబ్‌మన్ గిల్, జాక్ లీచ్ బౌలింగ్‌లో ఎల్బీడబ్ల్యూగా అవుట్ అయ్యాడు. గిల్ అవుటైన తర్వాత క్రీజులో వచ్చిన ఛతేశ్వర్ పూజారా 18 బంతుల్లో 7 పరుగులు చేయగా, రోహిత్ శర్మ 62 బంతుల్లో 2 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 25 పరుగులు చేసి క్రీజులో ఉన్నాడు.
undefined
అయితే రెండో ఇన్నింగ్స్‌లో రోహిత్ శర్మ అవుట్ కోరుతూ ఇంగ్లాండ్ తీసుకున్న డీఆర్‌ఎస్ రివ్యూ వివాదాస్పదమైంది. రోహిత్ శర్మ క్యాచ్ అవుట్ అయ్యాడంటూ అప్పీలు చేసింది ఇంగ్లాండ్ జట్టు. రివ్యూలో బంతి, బ్యాటుకి తగలకపోవడంతో నాటౌట్‌గా నిర్ణయాన్ని ప్రకటించాడు థర్డ్ అంపైర్.
undefined
అయితే టీవీ రిప్లైలో రోహిత్ శర్మ, ప్యాడ్లను తాకిన బంతి, వికెట్లను ముద్దాడుతున్నట్టు స్పష్టంగా కనిపించింది. థర్డ్ అంపైర్, ఎల్బీడబ్ల్యూ అవుట్‌ను చెక్ చేయకపోవడంతో అవుట్ అయ్యే ప్రమాదాన్ని తప్పించుకున్నాడు రోహిత్ శర్మ...
undefined
చేతిలో ఇంకా 9 వికెట్లు ఉండడం, మూడు రోజుల ఆట మిగిలి ఉండడంతో రెండో ఇన్నింగ్స్‌లో భారత జట్టు చేసే స్కోరు విజయాన్ని నిర్ణయించబోతోంది. ముఖ్యంగా తొలి ఇన్నింగ్స్‌లో డకౌట్ అయిన విరాట్ కోహ్లీ నుంచి ఓ మంచి ఇన్నింగ్స్ ఆశిస్తున్నారు అభిమానులు...
undefined
రెండో రోజు ఏకంగా 15 వికెట్లు పడడం విశేషం. 3006 పరుగుల వద్ద తొలి ఇన్నింగ్స్‌ ఆటను కొనసాగించిన భారత జట్టు మరో 29 పరుగులు జోడించి, మిగిలిన నాలుగు వికెట్లు కోల్పోయింది. భారత వికెట్ కీపర్ రిషబ్ పంత్ హాఫ్ సెంచరీతో నాటౌట్‌గా నిలిచాడు.
undefined
రెండో రోజు తొలి సెషన్‌లో బ్యాటింగ్ ప్రారంభించిన ఇంగ్లాండ్ జట్టు 59.5 ఓవర్లలో 134 పరుగులకి ఆలౌట్ అయ్యింది. గత మ్యాచ్‌లో డబుల్ సెంచరీ చేసిన జో రూట్ 6 పరుగులు చేయగా ఓల్లీ పోప 22, బెన్ స్టోక్స్ 18 పరుగులు చేశాడు. ఇంగ్లాండ్ వికెట్ కీపర్ ఫోక్స్ 107 బంతుల్లో 42 పరుగులు చేసి నాటౌట్‌గా ఉండడం విశేషం.
undefined
రవిచంద్రన్ అశ్విన్ టెస్టుల్లో 29వ సారి ఐదు వికెట్ల ప్రదర్శనతో అదరగొట్టగా తొలి మ్యాచ్ ఆడుతున్న అక్షర్ పటేల్ రెండు, ఇషాంత్ శర్మ రెండు, సిరాజ్ ఓ వికెట్ తీశారు.
undefined
టెస్టు క్రికెట్ చరిత్రలో ఇరు జట్ల వికెట్ కీపర్లు 40+ స్కోర్లు చేసి నాటౌట్‌గా నిలవడం, మిగిలిన జట్లంతా ఆలౌట్ కావడం ఇదే తొలిసారి.
undefined
click me!