నితీశ్రెడ్డి మరోసారి తన బ్యాటింగ్ సత్తా చూపించాడు
బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ తొలి టెస్టు తొలి ఇన్నింగ్స్లో నితీష్ రెడ్డి కష్టకాలంలో భారత్కు విలువైన ఇన్నింగ్స్ ఆడాడు. మరోసారి రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్ లో అదే రకమైన ఇన్నింగ్స్ ఆడి భారత జట్టు పరువు కాపాడాడు. నితీష్ రెడ్డి 54 బంతుల్లో 3 సిక్సర్లు, 3 ఫోర్లతో 42 పరుగుల ఇన్నింగ్స్ ఆడాడు. రిషబ్ పంత్ 21 పరుగుల ఇన్నింగ్స్ ఆడాడు. భారత జట్టు తొలి ఇన్నింగ్స్లో 180 పరుగులు చేసింది.