ఈ మెగా టోర్నీలో భారత జట్టుతో తొలి మ్యాచ్ ఆడిన పాకిస్తాన్.. తొలుత బ్యాటింగ్ చేసి 159 పరుగులకే పరిమితమైంది. ప్రధాన బ్యాటర్లంతా విఫలమైనా ఇఫ్తికార్ అహ్మద్, షాన్ మసూద్ ల పోరాటంతో పాక్ ఆ మాత్రం స్కోరైనా సాధించింది. కానీ బౌలింగ్ లో పాకిస్తాన్.. భారత్ ను వణికించింది. ఒక దశలో భారత్ స్కోరు 6 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 31 పరుగులు . కానీ విరాట్ కోహ్లీ, హార్ధిక్ పాండ్యాల భాగస్వామ్యంతో టీమిండియా ఆ మ్యాచ్ ను గెలుచుకుంది.