ఇక ఈ మ్యాచ్ లో ఓడిన తర్వాత తమకు వచ్చిన అవకాశాన్ని పాకిస్తాన్ సద్వినియోగం చేసుకుంది. తమ చివరి లీగ్ మ్యాచ్ లో బంగ్లాదేశ్ ను ఓడించి సెమీస్ బెర్త్ ను ఖాయం చేసుకుంది. భారత్, జింబాబ్వే చేతిలో ఓడిన ఆ జట్టు అనూహ్యంగా తర్వాత రెండు మ్యాచ్ లలో విజయం సాధించి నేడు బంగ్లాను ఓడించడంతో సెమీస్ కు అర్హత సాధించింది.