మూడు రోజుల క్రితం మెల్బోర్న్ వేదికగా భారత్-పాకిస్తాన్ మధ్య ముగిసిన ఉత్కంఠ పోరులో టీమిండియా 4 వికెట్ల తేడాతో విజయం సాధించిన విషయం తెలిసిందే. అయితే ఈ మ్యాచ్ లో బ్యాటర్ గా విఫలమైన పాక్ సారథి బాబర్ ఆజమ్, కెప్టెన్ గా కూడా విఫలమయ్యాడని ఆ దేశానికి చెందిన మాజీ క్రికెటర్లు దుమ్మెత్తిపోస్తున్నారు. అతడు సారథ్య బాధ్యతల నుంచి తప్పుకుంటే బెటరని సూచిస్తున్నారు.