రోహిత్ శర్మ తర్వాత ఎవరు..? అన్న చర్చ ఉత్పన్నమైనప్పుడు టీమిండియా అభిమానులు టక్కున వీరిద్దరి పేర్లే చెప్పేవాళ్లు. కానీ ఐపీఎల్-15 లో గుజరాత్ టైటాన్స్ ను విజేతగా నిలపడం.. ఆ సీజన్ లో కెప్టెన్ గానే కాక ఆటగాడిగా కూడా రాణించడంతో హార్థిక్ పాండ్యాపై సెలక్టర్ల దృష్టి పడింది. రోహిత్ లేని సమయంలో రాహుల్, రిషభ్ ల కంటే పాండ్యా నే బెస్ట్ ఆప్షన్ అని భావిస్తున్నారు.