మ్యాచ్ లో భారత్ గెలిచినా లక్నో పిచ్ పై మాత్రం తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. ఈ మ్యాచ్ ముగిశాక పిచ్ పొలాల్లో బీటలు వారితే అందులో బంతి పడి మెలికలు తిరిగినట్టుగా తిరుగుతుందని కొందరు అంటే.. అది పిచ్ కాదని, గతుకుల రోడ్డు అని మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు. ఈ పిచ్ పై టీమిండియా మాజీ ఆటగాడు, ప్రస్తుతం ఐపీఎల్ లో లక్నో సూపర్ జెయింట్స్ కు మెంటార్ గా వ్యవహరిస్తున్న గౌతం గంభీర్ తనదైన స్టైల్ లో విమర్శలు గుప్పించాడు.