ఈ ఏడాది స్వదేశంలో భారత్ పరిమిత ఓవర్ల క్రికెట్ లో జోరు చూపిస్తున్నది. శ్రీలంక, న్యూజిలాండ్ తో వన్డేలు, టీ20 సిరీస్ లను కైవసం చేసుకుంది. కివీస్ తో టీ20 సిరీస్ ముగిసిన నేపథ్యంలో భారత్.. ఇక రెడ్ బాల్ మీద దృష్టి పెట్టింది. ఈ నెల 9 నుంచి కఠిన ప్రత్యర్థి ఆస్ట్రేలియాతో భారత్.. నాలుగు టెస్టులు ఆడనుంది. బోర్డర్ - గవాస్కర్ ట్రోఫీలో ఈ సిరీస్ జరుగనుంది.