ICC WTC Final: ధోనీని అధిగమించిన విరాట్ కోహ్లీ... అత్యధిక టెస్టులకు సారథిగా...

First Published Jun 19, 2021, 2:54 PM IST

ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్‌ మ్యాచ్‌లో భారత సారథి విరాట్ కోహ్లీ, మాజీ సారథి మహేంద్ర సింగ్ ధోనీ పేరిట ఉన్న రికార్డును బ్రేక్ చేసి, సరికొత్త చరిత్ర క్రియేట్ చేశాడు. అత్యధిక టెస్టులకు సారథ్యం వహించిన సారథిగా టాప్‌లో నిలిచాడు కోహ్లీ...

విరాట్ కోహ్లీకి ఇది కెప్టెన్‌గా 61వ మ్యాచ్. భారత మాజీ సారథి మహేంద్ర సింగ్ ధోనీ 60 టెస్టులకు కెప్టెన్‌గా వ్యవహారించిన తర్వాత, టెస్టు రిటైర్మెంట్ ప్రకటించిన విషయం తెలిసిందే...
undefined
ధోనీ కంటే ముందు మాజీ క్రికెటర్లు, కెప్టెన్లు సౌరవ్ గంగూలీ 49 టెస్టులకు, మహ్మద్ అజారుద్దీన్ 47 టెస్టులకు, సునీల్ గవాస్కర్ 47 టెస్టులకు కెప్టెన్సీ వహించి టాప్ 5లో ఉన్నారు...
undefined
టీమిండియా తరుపునే కాకుండా ఆసియాలోనే అత్యధిక టెస్టులకు కెప్టెన్‌గా వ్యవహారించిన సారథిగా సరికొత్త రికార్డు క్రియేట్ చేయబోతున్నాడు విరాట్ కోహ్లీ. టీమిండియా, పాక్, బంగ్లాదేశ్, శ్రీలంక, ఆఫ్ఘాన్, నేపాల్ వంటి దేశాల్లో ఎక్కువ టెస్టులకు కెప్టెన్‌గా వ్యవహారించిన రికార్డు ధోనీ పేరిటే ఉండేది.
undefined
శ్రీలంక మాజీ కెప్టెన్ అర్జున రణతుంగ, పాకిస్తాన్ మాజీ కెప్టెన్ మిస్బా వుల్ హక్ 56 టెస్టులకు కెప్టెన్‌గా వ్యవహారించారు. దీంతో ఆసియాలోనే ఎక్కువ టెస్టులకు కెప్టెన్‌గా వ్యవహారించిన సారథిగా కోహ్లీ రికార్డు క్రియేట్ చేశాడు...
undefined
61 టెస్టుల్లో 36 విజయాలు అందుకున్న విరాట్ కోహ్లీ, 14 మ్యాచుల్లో పరాజయాలు చవిచూశాయి. 10 మ్యాచులు డ్రాగా ముగిశాయి. 59.01 విజయాల శాతంతో మోస్ట్ సక్సెస్‌ఫుల్ టీమిండియా టెస్టు కెప్టెన్‌గా నిలిచాడు కోహ్లీ...
undefined
మహేంద్ర సింగ్ ధోనీ 60 టెస్టుల్లో 27 విజయాలు అందుకోగా, సౌరవ్ గంగూలీ 49 మ్యాచుల్లో 21, అజారుద్దీన్ 47 టెస్టుల్లో 14 విజయాలు అందుకున్నారు...
undefined
2014 ధోనీ టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించిన సమయంలో భారత జట్టు టెస్టు ర్యాంకింగ్స్‌లో ఏడో స్థానంలో ఉంది. విరాట్ కోహ్లీ కెప్టెన్‌గా వరుసగా ఐదేళ్లు టెస్టు ర్యాంకింగ్స్‌లో టాప్‌లో నిలిచి ఐదుసార్లు టెస్టు ఛాంపియన్‌షిప్ గదను అందుకుంది భారత జట్టు.
undefined
click me!