ఉపఖండంలో భారత్ అత్యంత ప్రమాదకర జట్టు అని ఇంజమామ్ ప్రశంసలు కురిపించాడు. జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ షమీ వంటి సీనియర్లతో పాటు శార్దుల్ ఠాకూర్ వంటి ఆల్ రౌండర్లు కూడా ఉండటం భారత్ కు కలిసొచ్చే అంశమని అభిప్రాయపడ్డాడు. బ్యాటింగ్ లో భారత్ కు ప్రపంచంలోనే తిరుగులేని లైనప్ ఉందని ఇంజమామ్ అన్నాడు.