టెస్టులలో నెంబర్ వన్ స్థానంలో లేకున్నా భారత్ వన్డే, టీ20లలో మాత్రం అగ్రస్థానాన్ని నిలబెట్టుకుంది. టీ20లలో భారత జట్టు.. 267 రేటింగ్ పాయింట్లతో అగ్రస్థానంలో నిలవగా.. ఇంగ్లాండ్ (266), పాకిస్తాన్ (258), సౌతాఫ్రికా (256), న్యూజిలాండ్ (252), ఆస్ట్రేలియా (251) లు తదుపరి స్థానాల్లో ఉన్నాయి. వన్డేలలో 50 ఓవర్ల ఫార్మాట్ లో భారత్.. 114 పాయింట్లతో తొలి స్థానంలో ఉండగా.. 112 పాయింట్లతో ఆసీస్ రెండో స్థానంలో ఉంది. న్యూజిలాండ్, ఇంగ్లాండ్ లు 111 పాయింట్లతో 3, 4వ స్థానాల్లో ఉన్నాయి.