టాస్ కు ముందే ఆజమ్ తో పాటు పలువురు పాక్ ఆటగాళ్లు టీ20 ప్రపంచకప్ లో భారత జట్టు మెంటార్ గా పనిచేసిన మాజీ సారథి మహేంద్ర సింగ్ ధోని తో మాట్లాడారు. పాక్ ఆటగాళ్లు ఇమాద్ వాసీం, బాబర్ ఆజమ్, మాలిక్ లు జార్ఖండ్ డైనమైట్ తో ముచ్చిటించారు. ఇందుకు సంబంధించిన చిత్రాలు మ్యాచ్ అనంతంరం వైరల్ గా మారాయి.