వాస్తవానికి గతేడాది దుబాయ్ వేదికగా ముగిసిన టీ20 ప్రపంచకప్ తర్వాత షమీ భారత జట్టులో పొట్టి ఫార్మాట్ లో ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు. అసలు అతడు తమ దృష్టిలో లేడని.. షమీని టెస్టులు, వన్డేలకు మాత్రమే పరిగణిస్తామని సెలక్టర్లు కూడా పలు సందర్భాల్లో వ్యాఖ్యానించారు. కానీ బుమ్రా గాయంతో వాళ్లకు వేరే ఆప్షన్ లేకుండా పోయింది.