పరుగుల యంత్రం విరాట్ కోహ్లీ మునపటి ఫామ్ అందుకున్నాక పట్టపగ్గాల్లేకుండా చెలరేగుతున్నాడు. ముఖ్యంగా టీ20 ప్రపంచకప్ లో కోహ్లీ.. ఇప్పటివరకు నాలుగు మ్యాచ్ లు ఆడి 220 పరుగులు చేశాడు. కోహ్లీ సగటు కూడా 220 గా ఉండటం గమనార్హం. పాకిస్తాన్, నెదర్లాండ్స్, దక్షిణాఫ్రికా, బంగ్లాదేశ్ తో మ్యాచ్ లు ఆడిన కోహ్లీ.. ఒక్క సఫారీల మీద తప్ప మిగిలిన మూడు జట్ల మీద హాఫ్ సెంచరీలు బాదాడు.