ఈ సిరీస్ లో ఇప్పటివరకు 3 టెస్టులలో 21 వికెట్లు తీసి టాప్ ప్లేస్ లో ఉన్నాడు. లియాన్ (19), అశ్విన్ (18) లు ఆ తరువాతి స్థానాల్లో ఉన్నారు. ఈ సిరీస్ లో నాలుగో టెస్టు మార్చి 9 నుంచి అహ్మదాబాద్ వేదికగా జరుగనుంది. ఈ మ్యాచ్ లో గెలిస్తే భారత్.. మిగతా సమీకరణాలతో తేడా లేకుండా డబ్ల్యూటీసీ ఫైనల్ కు అర్హత సాధిస్తుంది. ఓడినా, డ్రా అయినా శ్రీలంక - న్యూజిలాండ్ రెండు టెస్టుల సిరీస్ ఫలితం కోసం వేచి చూడాల్సి ఉంటుంది.