లంకతో ఇటీవలే ముగిసిన వన్డే సిరీస్ లో కోహ్లీ తొలి వన్డేలో సెంచరీ చేశాడు. రెండో వన్డేలో విఫలమైనా మూడో వన్డేలో 160 ప్లస్ స్కోరు చేశాడు. మూడు మ్యాచ్ లలో కలిపి 141.50 సగటుతో 283 పరుగులు చేయడంతో అతడికే ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డు కూడా దక్కింది. అయితే ఆ అవార్డు కోహ్లీకి ఇవ్వడం కరెక్ట్ కాదని అంటున్నాడు గంభీర్.