ఇక భారత స్పిన్ త్రయం అశ్విన్, రవీంద్ర జడేజా, అక్షర్ లను రోహిత్ ఆసీస్ పేసర్లు పాట్ కమిన్స్, మిచెల్ స్టార్క్, జోష్ హెజిల్వుడ్ లతో పోల్చాడు. అక్షర్, జడ్డూ, ఆష్ (అశ్విన్) లు తమను ఎప్పుడూ నిరాశపరచరని.. ఈ ముగ్గురూ మరింతకాలం భారత్ కు సేవలందిస్తారని రోహిత్ చెప్పాడు. ప్రత్యేకించి అశ్విన్ కు వయసు పెరుగుతున్నా అతడి బౌలింగ్ లో వాడి తగ్గలేదని చెప్పాడు.