తొలి సీజన్ లో ఆటగాళ్లను కొనుగోలు చేయడానికి బీసీసీఐ రూ. 10 లక్షల బేస్ ప్రైస్ ను నిర్ణయించింది. రూ. 10 లక్షలు, రూ. 20 లక్షలు, రూ. 30 లక్షలు, రూ. 40 లక్షలు, రూ. 50 లక్షల కేటగిరీలలో ఆటగాళ్లను విభజించారు. ఈ ధరల ప్రకారం ఆటగాళ్లను కొనుగోలు చేయవచ్చు. ఆటగాళ్లను దక్కించుకోవడానికి ఒక్కో టీమ్ రూ. 9 కోట్ల నుంచి రూ. 12 కోట్ల వరకూ ఖర్చు చేయవచ్చు. ఐదు టీమ్ లు కలిపి రూ. 60 కోట్ల దాకా ఖర్చు చేసే అవకాశముంది.