టీ20 వరల్డ్ కప్ 2021 నుంచే పాఠాలు నేర్చుకున్నా! నా టార్గెట్ అదే... - రోహిత్ శర్మ...
First Published Aug 11, 2022, 4:13 PM ISTటైటిల్ ఫెవరెట్గా టీ20 వరల్డ్ కప్ 2021 టోర్నీ బరిలో దిగిన భారత జట్టు, మొదటి రెండు మ్యాచుల్లో చిత్తుగా ఓడి గ్రూప్ స్టేజీకే పరిమితమైంది. పాకిస్తాన్తో మ్యాచ్లో 10 వికెట్ల తేడాతో చిత్తైన భారత జట్టు, న్యూజిలాండ్తో మ్యాచ్ ఆడడమే ఇష్టం లేదన్నట్టుగా ఆడింది. ఈ టోర్నీ నుంచి తాను పాఠాలు నేర్చుకున్నానని కామెంట్లు చేస్తున్నాడు ప్రస్తుత సారథి రోహిత్ శర్మ...