తన సహచర ఆటగాడు, పరుగుల యంత్రం విరాట్ కోహ్లీ కూడా మూడేండ్ల విరామం తర్వాత గతేడాది మళ్లీ సెంచరీల బాట పట్టిన విషయం తెలిసిందే. గతేడాది ఆఫ్గాన్ పై సెంచరీ చేసిన అతడు తర్వాత బంగ్లాపై ఒకటి, శ్రీలంక పై రెండు సెంచరీలు బాది ఫుల్ ఫామ్ లోకి వచ్చాడు. ఈ నేపథ్యంలో మరి రోహిత్.. శతక కరువు తీరేది ఎప్పుడు..? అని అతడి అభిమానులు వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు.