బంగ్లాదేశ్పై భారత్ విజయం సాధించడంపై దాయాది దేశం పాకిస్తాన్ మాజీలు ఓర్వలేకపోతున్నారు. ఈ మ్యాచ్ లో వర్షం అనంతరం మ్యాచ్ ప్రారంభించడంపై వాళ్లు అవాకులు చెవాకులు పేలుతూనే ఉన్నారు. ఐసీసీ.. ఇండియా (బీసీసీఐ)కు అనుకూలంగా వ్యవహరిస్తుందని మరోసారి ఈ మ్యాచ్ ద్వారా నిరూపితమైందని పాక్ మాజీ సారథి షాహిద్ అఫ్రిది సంచలన కామెంట్స్ చేశాడు.