రాజస్తాన్ రాయల్స్ తో జరిగిన మ్యాచ్ లో మార్క్రమ్, క్లాసెన్ వంటి కీలక ఆటగాళ్లు లేని లోటు స్పష్టంగా కనిపించింది. అలాగే బౌలింగ్ లో అనుభవలేమి కూడా కొట్టొచ్చినట్టు ఉంది. టీమ్ లో భువనేశ్వర్ తప్ప అనుభవజ్ఞుడైన పేసర్ లేకపోవడం సన్ రైజర్స్ ను తీవ్రంగా ప్రభావం చేసింది. మార్క్రమ్, క్లాసెన్, జాన్సేన్ ల రాకతో టీమ్ దృఢంగా మారింది.