మహారాష్ట్రలోని వాంఖెడే, బ్రబోర్న్ (సీసీఐ), డీవై పాటిల్ స్టేడియంలో 55 మ్యాచులు జరుగనుండగా.. పూణెలోని ఎంసీఎ గ్రౌండ్ లో 15 మ్యాచులు జరుగుతాయి. లీగ్ దశలో మొత్తంగా 70 మ్యాచులు ఉంటాయన్న విషయం తెలిసిందే. అయితే ప్లే ఆఫ్స్ కు సంబంధించిన షెడ్యూల్ ఇంకా విడుదల చేయాల్సి ఉంది.