వన్డే ప్రపంచకప్ 2023 తర్వాత గ్రౌండ్ లోకి అడుగుపెతున్న షమీ
షమీకి చెందిన భారత కిట్ను ఇప్పటికే ఆస్ట్రేలియాకు పంపించామని సంబంధిత క్రికెట్ వర్గాలు తెలిపినట్టు పీటీఐ నివేదికలు పేర్కొంటున్నాయి. అతను ముస్తాక్ అలీ ట్రోఫీ టీ20 టోర్నీని పూర్తి చేసి ఆ తర్వాత వెళ్తాడు. 34 ఏళ్ల షమీ చివరిసారిగా 2023 వన్డే ప్రపంచకప్ ఫైనల్లో భారత్ తరఫున ఆడాడు. ఆ తర్వాత చీలమండ శస్త్రచికిత్స కారణంగా చాలా కాలం పాటు గ్రౌండ్ బయట ఉండవలసి వచ్చింది. న్యూజిలాండ్పై అతని పునరాగమనం ఖచ్చితంగా అనిపించింది, అయితే దీనికి ముందు, షమీ మోకాలి వాపు వచ్చింది, ఇది అతని పునరాగమనాన్ని ఆలస్యం చేసింది. ఇప్పుడు ఆస్ట్రేలియాలో భారత జట్టు తరఫున బరిలోకి దిగనున్నాడు.