అయితే ఆస్ట్రేలియాకు ఏ ఏ ఆటగాళ్లను పంపించాలి..? అనేదానిమీద ఇప్పటికే జోరుగా చర్చలు సాగుతున్నాయి. క్రికెట్ పండితులు, విశ్లేషకులు, విమర్శకులు ఎవరికి తోచిన విధంగా వాళ్లు సూచనలు చేస్తున్నారు. తాజాగా టీ20 ప్రపంచకప్ లో ఆడబోయే స్పిన్నర్లపై టీమిండియా మాజీ క్రికెటర్, ప్రస్తుతం కామెంటేటర్ గా వ్యవహరిస్తున్న ఆకాశ్ చోప్రా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.