యూసుఫ్ పఠాన్: 2008 లో జరిగిన తొలి ఐపీఎల్ మ్యాచ్ రాజస్తాన్ రాయల్స్, చెన్నై సూపర్ కింగ్స్ మధ్య జరిగింది. ఈ మ్యాచ్ లో రాజస్తాన్ తరఫున ఆడిన యూసుఫ్ పఠాన్ అదిరిపోయే ప్రదర్శన చేశాడు. ముందు బౌలింగ్ లో 22 పరుగులిచ్చి 3 వికెట్లు తీసిన YUSUF PATHAN.. బ్యాటింగ్ లో 39 బంతుల్లోనే 56 పరుగులు చేసి తన జట్టును గెలిపించుకున్నాడు. దీంతో అతడికి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది.