ముంబై, బెంగళూరు, అహ్మదాబాద్, లక్నో, ఢిల్లీలు ఫ్రాంచైజీలుగా ఎంపికయ్యాయి. ముంబై (అంబానీ), బెంగళూరు (ఆర్సీబీ), ఢిల్లీ (ఢిల్లీ క్యాపిటల్స్) లను ఐపీఎల్ ఫ్రాంచైజీలే దక్కించుకోగా అహ్మదాబాద్ ఫ్రాంచైజీని ప్రముఖ వ్యాపారవేత్త గౌతం అదానీ, లక్నో టీమ్ ను క్యాప్రీ గ్లోబల్ హోల్డింగ్స్ వాళ్లు సొంతం చేసుకున్నారు. అహ్మదాబాద్ టీమ్ ఇదివరకే తమ జట్టుకు మెంటార్ గా భారత మాజీ సారథి మిథాలీ రాజ్ ను నియమించుకున్న విషయం తెలిసిందే.