టీమిండియాలో అతను కచ్ఛితంగా ఉండాలి... ఫోన్లు స్విచ్ఛాఫ్ చేసేయండి... మహ్మద్ కైఫ్

First Published Dec 20, 2020, 1:59 PM IST

ఓ అద్భుత విజయం ఎంత జోష్ నిస్తుందో, ఓ ఘోర పరాజయం అంతే ఒత్తిడిలోకి నెట్టేస్తుంది. మొదటి టెస్టు మూడో ఇన్నింగ్స్ ఇచ్చిన షాక్ నుంచి టీమిండియా తేరుకోవాలంటే చాలా సమయమే పడుతుంది. అయితే భారత ఆటగాళ్లకి అంత టైమ్ లేదు. డిసెంబర్ 26 నుంచి రెండో టెస్టు మొదలుకానుంది. ఈ టెస్టుకి ముందు టీమిండియా తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి చెప్పుకొచ్చాడు భారత మాజీ క్రికెటర్ మహ్మద్ కైఫ్.

తొలి టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో 36 పరుగులకే ఆలౌట్ అయ్యింది భారత క్రికెట్ జట్టు. భారత బ్యాట్స్‌మెన్‌లో ఏ ఒక్కరూ కూడా సింగిల్ డిజిట్ స్కోరు దాటలేకపోయారు.
undefined
ఈ ఘోర పరాజయం నుంచి ఎంత తొందరగా బయటపడగలిగితే టీమిండియాకి అంత మంచిదని అభిప్రాయం వ్యక్తం చేశాడు భారత మాజీ క్రికెటర్ మహ్మద్ కైఫ్...
undefined
36 పరుగులకే పరిమితమైన టీమిండియాపై ఇప్పటికే బీభత్సమైన ట్రోలింగ్ మొదలైంది. భారత క్రికెట్ ఫ్యాన్స్‌తో పాటు పాక్, ఆసీస్ ఫ్యాన్స్ కూడా టీమిండియాను ట్రోల్ చేస్తూ ఆటాడుకుంటున్నారు.
undefined
కెప్టెన్ విరాట్ కోహ్లీతో పాటు రహానే, పూజారా, పృథ్వీషా... ఇలా ప్రతి ఒక్కరూ సోషల్ మీడియా నుంచి ట్రోలింగ్ ఎదుర్కొంటున్నారు. కోచ్ రవిశాస్త్రిపై వస్తున్న ట్రోల్స్ గురించి చెప్పాల్సిన అవసరమే లేదు.
undefined
పింక్ బాల్ టెస్టు పరాభవం నుంచి తేరుకోవాలంటే టీమిండియా ప్లేయర్లు వెంటనే ఫోన్లు స్విచ్ఛాప్ చేయాలని సలహా ఇచ్చాడు మహ్మద్ కైఫ్...
undefined
‘ఈ ఓటమి ఊహించలేనిది. టీమిండియా ప్లేయర్లు మీ ఫోన్లను స్విచ్ఛాఫ్ చేయండి. విమర్శలను పట్టించుకోకండి....
undefined
ట్రోల్స్‌ను పక్కనబెట్టి అందరూ జట్టుగా ఒక్కతాటిపైకి రండి... ఈ ఘోర ఓటమిని మరిచిపోవాలంటే టీమిండియా ముందున్న ఏకైక మార్గం ఇదే...
undefined
విరాట్ కోహ్లీ గైర్హజరీలో అజింకా రహానే జట్టులో ఉత్సాహాన్ని నింపాలి... తన కెప్టెన్సీలో టీమిండియాను ముందుండి నడిపించాలి...
undefined
కొన్నాళ్లుగా మంచి ఫామ్‌లో ఉన్న బ్యాట్స్‌మెన్ కెఎల్ రాహుల్‌కి తుది జట్టులో చోటు దక్కాలి. విరాట్ లేని లోటుని అతను భర్తీ చేయగలడు...’ అంటూ చెప్పాడు మహ్మద్ కైఫ్...
undefined
ఆడిలైడ్‌లో మొదటి టెస్టు ఆడిన టీమిండియా... 96 ఏళ్ల క్రికెట్ చరిత్రలోనే చెత్త రికార్డు నమోదుచేసింది. అత్యల్ప స్కోరుతో పాటు 11 మంది ప్లేయర్లు సింగిల్ డిజిట్ స్కోరుకే నమోదయ్యారు.
undefined
మూడో ఇన్నింగ్స్‌లో ఎక్స్‌ట్రాలు కూడా ఇవ్వకుండా బౌలింగ్ చేసింది ఆస్ట్రేలియా... 21.2 ఓవర్లలో ఒక్క వైడ్ కానీ, నో బాల్ కానీ లేకుండా బౌలింగ్ చేశారు ఆసీస్ బౌలర్లు మిచెల్ స్టార్క్, ప్యాట్ కమ్మిన్స్, జోష్ హజల్‌వుడ్.
undefined
click me!