ఆ చెక్ ను బ్యాంక్ లో వేసుకున్నా అందులో డబ్బులు లేక అది కాస్తా బౌన్స్ అయింది. దీంతో షాక్ తిన్న ఎస్కే ఎంటర్ ప్రైజెస్.. ధోని ప్రమోట్ చేస్తున్న సంస్థకు లీగల్ నోటీసులు పంపింది.కానీ వాళ్లకు న్యూఇండియా సంస్థ నుంచి ఎటువంటి సమాధానం రాలేదు. దీంతో ఎస్కే ఎంటర్ప్రైజెస్ ఓనర్ నీరజ్ కుమార్ నిరల.. న్యూఇండియా సంస్థతో పాటు ధోని పై కూడా కేసు నమోదు చేశాడు. ఏడుగురి పేరును ఎఫ్ఐఆర్ లో జతపరిచాడు.