రెండు దేశాల మధ్య జరిగే ద్వైపాక్షిక సిరీస్ లు దండగ వ్యవహారమని, వాటిని తగ్గించి ఐపీఎల్ ను ప్రతి ఏటా రెండు సీజన్లుగా ఆడించాలని టీమిండియా మాజీ హెడ్ కోచ్ రవిశాస్త్రి సంచలన వ్యాఖ్యలు చేశాడు. ద్వైపాక్షిక సిరీస్ లతో ఒనగూరేదేమీ లేదని.. ఏడేండ్లు తాను టీమిండియా కోచ్ గా పనిచేసినా తనకు ఒక్క మ్యాచ్ కూడా గుర్తులేదని.. వాటికి బదులు టీ20 ప్రపంచకప్ ఒకటి ఆడించి మిగతావి దాదాపు తగ్గించడమే మంచిదని.. ఆ దిశగా క్రికెట్ బోర్డులు ఆలోచన చేయాలని వ్యాఖ్యానించాడు.