ప్రపంచ క్రికెట్ లో అత్యంత క్రేజ్ ఉన్న మ్యాచ్ లలో ఇండియా-పాకిస్తాన్ పోరు ప్రథమ స్థానంలో ఉంటుంది. ఏడాది, రెండేండ్లకు ఒక మ్యాచ్ జరిగినా ఇరు జట్ల అభిమానులతో పాటు ప్రపంచ క్రికెట్ అభిమానులు ఆసక్తిగా ఈ మ్యాచ్ ను చూస్తారు. స్టేడియాలలో ఐసీసీ.. టీవీ, డిజిటల్ మీడియాలలో (ఇండియాలో) ఆ క్రేజ్ ను డిస్నీ స్టార్ లు సొమ్ము చేసుకుంటున్నాయి.