16 ఏండ్ల టీమిండియా (కార్తీక్) టీ20 కెరీర్ లో చాలామంది ఆటగాళ్లు వచ్చారు. వెళ్లారు. 2006 లో ఇండియా తొలి టీ20 ఆడిన వారిలో ప్రస్తుతం దినేశ్ కార్తీక్ తప్ప మరెవ్వరూ జట్టులో లేరు. ప్రస్తుతం టీమిండియా కెప్టెన్ రిషభ్ పంత్ తో సహా.. ఇషాన్ కిషన్, రుతురాజ్ గైక్వాడ్, అవేశ్ ఖాన్ వంటి ఆటగాళ్లు అప్పటికి ఇంకా సరిగా బ్యాట్ కూడా పట్టుకోలేని వయసులో ఉండుంటారు.