బర్త్ డే, మ్యారేజ్ డే సెలబ్రేట్ చేసుకోవడానికి కుటుంబంతో కలిసి ఇంగ్లాండ్కి వెళ్లాడు మహేంద్ర సింగ్ ధోనీ. లండన్లో బర్త్ డే పార్టీ చేసుకున్న మాహీ, ట్రెంట్బ్రిడ్జ్లో ఉన్న మూడో టీ20 కోసం సన్నద్ధమవుతున్న భారత జట్టును కలిశాడు..
Image credit: BCCI
బయో బబుల్ నిబంధనలు అమలులో లేకపోవడంతో భారత మాజీ సారథి మహేంద్ర సింగ్ ధోనీ, భారత జట్టును కలిసి డ్రెస్సింగ్ రూమ్లో రిషబ్ పంత్, ఇషాన్ కిషన్, తదితర సహాయక సిబ్బందితో కలిసి కాసేపు ముచ్ఛటించాడు...
Image credit: BCCI
ఎడ్జ్బాస్టన్ టెస్టులో సెంచరీ చేసి అదరగొట్టిన రిషబ్ పంత్, ఆ తర్వాత లండన్ చేరుకుని తన ఐడెల్ మహేంద్ర సింగ్ ధోనీ బర్త్ డే వేడుకల్లో పాల్గొన్నాడు... ఇప్పుడు స్వయంగా మాహీయే రిషబ్ పంత్ మాస్కులో డ్రెస్సింగ్ రూమ్కి వచ్చి అందర్నీ ఆశ్చర్యానికి గురి చేశాడు..
Image credit: Getty
భారత మాజీ కెప్టెన్, వికెట్ కీపర్ మహేంద్ర సింగ్ ధోనీ రిటైర్మెంట్తో భారత జట్టుకి మూడు ఫార్మాట్లలోనూ ప్రధాన వికెట్ కీపర్గా మారాడు రిషబ్ పంత్. ఐపీఎల్ 2020 తర్వాత ఆస్ట్రేలియా టూర్లో అదరగొట్టి కమ్బ్యాక్ ఇచ్చిన రిషబ్ పంత్, సౌతాఫ్రికాతో జరిగిన టీ20 సిరీస్కి కెప్టెన్గా వ్యవహరించాడు...
Image credit: PTI
ఎమ్మెస్ ధోనీ వారసుడిగా రిషబ్ పంత్ని ప్రమోట్ చేస్తూ వచ్చింది బీసీసీఐ. ఆరంభంలో ఎన్ని మ్యాచుల్లో విఫలమైనా రిషబ్ పంత్కి వరుస అవకాశాలు ఇవ్వడంతో తీవ్ర విమర్శలు వచ్చాయి...
రిషబ్ పంత్కి ఇన్ని అవకాశాలు ఇచ్చే బదులు సంజూ శాంసన్, ఇషాన్ కిషన్, శ్రీకర్ భరత్ వంటి వేరే వికెట్ కీపర్లను వాడుకోవాలనే వాదనలు వినిపించాయి. ఆరంభంలో పంత్ని ఎమ్మెస్ ధోనీతో పోల్చి చూస్తూ అభిమానులు గేలి చేసేవాళ్లు...
అయితే ఇప్పుడు మహేంద్ర సింగ్ ధోనీకి సరైన వారసుడిగా మారిన రిషబ్ పంత్, తనకంటూ టీమ్లో ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు. విదేశాల్లో కూడా అదరగొడుతూ మాహీ రికార్డులు కూడా బ్రేక్ చేస్తున్నాడు...