భారత్ తొలి ఐసీసీ టీ20 వరల్డ్ కప్ గెలిచిన జట్టులోని సభ్యులుగా ఉన్న ఎంఎస్ ధోని, రాబిన్ ఊతప్పలు మంచి మిత్రులు. భారత జట్టుతో పాటు ఐపీఎల్ లో కూడా ఈ ఇద్దరూ కలిసి ఆడారు. చెన్నై సూపర్ కింగ్స్ తరఫున ఆడిన ఊతప్ప గతేడాది ఐపీఎల్ ముగిసిన తర్వాత ఆటకు రిటైర్మెంట్ ప్రకటించిన విషయం విదితమే.