ఐపీఎల్-15 సీజన్ లో సీఎస్కేకు ఏదీ కలిసిరాలేదు. జడేజా కెప్టెన్సీ, దీపక్ చాహర్ కు గాయం, రుతురాజ్ ఫామ్ కోల్పోవడం.. ఇలా ప్రతీది సీఎస్కేకు అనుకూలంగా జరగలేదు. అచ్చంగా 2020 సీజన్ లో కూడా సీఎస్కే ఇలాగే పాయింట్ల పట్టికలో అట్టడుగున నిలిచింది. కానీ 2021 సీజన్ లో ఏకంగా ఛాంపియన్ గా నిలిచింది.