అలాగే భారత్ బ్యాటింగ్ చేసే సమయంలో రోహిత్, కోహ్లీ, రాహుల్, సూర్యలతో పాటు పాండ్యా పైనా ఫోకస్ పెట్టాలని పాక్ బౌలర్లకు తెలిపింది. గత మ్యాచ్ లో హార్ధిక్.. స్పిన్నర్ షాదాబ్ ఖాన్ బౌలింగ్ లో ఆడేందుకు ఇబ్బందిపడ్డాడు. దాంతో హార్ధిక్ బ్యాటింగ్ కు వచ్చేప్పుడు షాదాబ్ తో ఓవర్లు వేయించేలా ప్రణాళికలు సిద్ధం చేసింది.