మాహీకి జనాల్లో విపరీతమైన ఫాలోయింగ్ ఉంటే, సోషల్ మీడియాలో మాహీ కంటే ఆయన సతీమణి సాక్షి సింగ్కే క్రేజ్ ఎక్కువ. ఐపీఎల్లోనూ సాక్షి సందడి కనిపిస్తుంది.
తాజాగా సాక్షి సింగ్ చేసిన పోస్టును బట్టి చూస్తే, మాహీకి సాక్షికీ పెళ్లికి ముందు మూడేళ్ల నుంచి పరిచయం ఉన్నట్టు తెలుస్తోంది....
ఐపీఎల్ 2021, టీ20 వరల్డ్ కప్ 2021 టోర్నీలు ముగిసిన తర్వాత స్వదేశానికి చేరుకున్న మహీ, ప్రస్తుతం కుటుంబంతో కలిసి ఓ పెళ్లికి హాజరయ్యాడు...
జైపూర్లో జరిగిన ఈ పెళ్లి వేడుకలో మాహీతో కలిసి దిగిన ఫోటోను పోస్టు చేసిన సాక్షి, ‘చీర్స్... మనం ఒకరికొకరం తెలిసి 14 ఏళ్లు అవుతోంది’ అంటూ కాప్షన్ ఇచ్చింది...
2010లో సాక్షి సింగ్ను వివాహం చేసుకున్నాడు మాహీ. 14 ఏళ్లంటే అంతకుముందు మూడేళ్ల క్రితమే అంటే 2007లో ధోనీ, సాక్షి సింగ్ల మధ్య పరిచయం ఏర్పడి ఉంటుంది...
ఐపీఎల్ 2021 సీజన్లో మహేంద్ర సింగ్ ధోనీ, తన రేంజ్కి తగ్గ ఒక్కటంటే ఒక్క పర్ఫామెన్స్ కూడా ఇవ్వలేకపోయాడు... బ్యాటింగ్లో ఘోరంగా ఫెయిల్ అవుతూ వచ్చాడు...
అదీకాకుండా పెద్దగా అంతర్జాతీయ అనుభవం లేని ఆవేశ్ ఖాన్, చేతన్ సకారియా, వరుణ్ చక్రవర్తి, రవి భిష్ణోయ్ల బౌలింగ్లో క్లీన్బౌల్డ్ అయ్యాడు మహేంద్ర సింగ్ ధోనీ...
ఢిల్లీ క్యాపిటల్స్తో జరిగిన మ్యాచ్లో 19 పరుగులు చేసిన మాహీ ఇన్నింగ్స్ను ఫుల్లుగా ఎంజాయ్ చేసింది ధోనీ భార్య సాక్షి సింగ్. 19 పరుగులు కావాల్సిన దశలో ఆవేశ్ ఖాన్ బౌలింగ్లో ధోనీ కొట్టిన సిక్సర్కి ఎగిరి గంతేసి, పక్కనే ఉన్న సీఎస్కే సపోర్టర్ను హత్తుకుంది సాక్షి సింగ్...
ఆ తర్వాతి ఓవర్లో వరుస ఫోర్లు కొడుతూ, చెన్నై సూపర్ కింగ్స్కి ఫైనల్ బెర్త్ కన్ఫార్మ్ చేశాడు మహేంద్ర సింగ్ ధోనీ. విన్నింగ్ షాట్ కొట్టిన సమయంలో భావోద్వేగాన్ని ఆపుకోలేక ఏడ్చేసింది సాక్షి సింగ్...
సాక్షి సింగ్ రెండోసారి గర్భం దాల్చిందని, ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ సమయానికే నాలుగు నెలల కడుపుతో ఉందని ప్రియాంక రైనా చెప్పినట్టు వార్తలు వచ్చాయి. అయితే తాజాగా ఆమె పోస్టు చేసిన ఫోటోలు చూస్తుంటే, ఆ వార్తల్లో నిజం లేదని తెలుస్తోంది.