విల్ యంగ్, టామ్ లాథమ్ సెంచరీలు
ఈ మ్యాచ్ లో కీవీస్ ప్లేయర్లు విల్ యంగ్, టాల్ లాథమ్ లు సెంచరీలతో దరగొట్టారు. విల్ యంగ్ పాకిస్థాన్పై 113 బంతుల్లో 107 పరుగులు (12 ఫోర్లు, ఒక సిక్స్) చేసి ఛాంపియన్స్ ట్రోఫీ 2025 టోర్నమెంట్లో సెంచరీ కొట్టిన తొలి ప్లేయర్ గా నిలిచాడు. విల్ యంగ్ కు ఇది వన్డేల్లో నాల్గో సంచరీ కాగా, పాకిస్థాన్పై మొదటిది.
విల్ యంగ్ సెంచరీ తర్వాత టామ్ లాథమ్ కూడా సెంచరీని పూర్తి చేశాడు. టామ్ లాథమ్ 104 బంతుల్లో 10 బౌండరీలు, 3 సిక్సర్లతో 118 పరుగులు చేసి నాటౌట్గా నిలిచాడు. దీంతో న్యూజిలాండ్ 320/5 స్కోరు చేయగలిగింది. భారీ టార్గెట్ తో బరిలోకి దిగిన పాకిస్తాన్ 260 పరుగులకే ఆలౌట్ అయింది. 60 పరుగుల తేడాతో పాకిస్తాన్ పై కివీస్ విజయం సాధించింది.