పూణెలో కొత్త ఇంటికి కొనుగోలు చేసిన మహేంద్ర సింగ్ ధోనీ... మాహీ కొత్త ఇంటి ధర ఎంతో తెలిస్తే...

First Published May 30, 2021, 5:27 PM IST

ప్రపంచంలో అత్యంత ధనిక క్రికెటర్లలో భారత మాజీ సారథి, కెప్టెన్ కూల్ మహేంద్ర సింగ్ ధోనీ ఒకడు. ఇప్పటికే రాంఛీలో ఓ విలాసవంతమైన భవంతిలో నివాసం ఉంటున్న మహేంద్ర సింగ్ ధోనీ, తాజాగా పూణెలో మరో ఇంటికి కొనుగోలు చేశాడు.

రాంఛీలో ఉన్న మహేంద్ర సింగ్ ధోనీ ఇంటి విలువ దాదాపు 6 కోట్లు. ఈ ఇంటిని స్వయంగా మహేంద్ర సింగ్ ధోనీ డిజైన్ చేసి, కట్టించుకున్నాడు. ఇది కాకుండా రాంఛీలో ఏడు ఎకరాల్లో విలసవంతమైన ఫామ్‌ హౌజ్ కూడా ఉంది.
undefined
ఇక్కడే తాను ఎంతో ఇష్టపడి కట్టుకున్న మరో ఇంట్లో ఉంటూ వ్యవసాయ పనులను పర్యవేక్షిస్తుంటాడు మహేంద్ర సింగ్ ధోనీ. దీనికి ‘కైలాష్‌పాటి’ అని పేరు కూడా పెట్టాడు ధోనీ.
undefined
కైలాష్‌పాటిని నిర్మించేందుకు మూడేళ్ల సమయం పట్టింది. అంతర్జాతీయ క్రికెట్‌కి దూరమైన తర్వాత తన సమయాన్ని మొత్తం ఈ ఇంటి నిర్మాణానికి వెచ్చించాడు ధోనీ...
undefined
రాంఛీలో ఉన్న మహేంద్ర సింగ్ ధోనీ మొదటి ఇంటి నుంచి 20 నిమిషాల దూరంలో ఉందీ ఫామ్‌ హౌజ్. మొదటి ఇంట్లో ధోనీ తల్లిదండ్రులు నివసిస్తుంట, మాహీ రాంఛీలోని తన ఫామ్‌హౌజ్‌లోనే ఎక్కువ సమయం గడుపుతాడు.
undefined
ఇందులో జిమ్, స్విమ్మింగ్ పూల్, విలాసమైన లాన్, గార్డెన్ ఉన్నాయి. ఇక్కడే కూతురు జీవాతో కలిసి పెంపుడు కుక్క, గుర్రాలతో ఆడుకుంటూ ఉంటాడు మహేంద్ర సింగ్ ధోనీ.
undefined
ఇది కాకుండా మహేంద్ర సింగ్ ధోనీకి ముంబైలోని ఓ ఖరీదైన ఏరియాలో ఇల్లు ఉంది. దాదాపు ఏడాది కిందటే దీన్ని కొనుగోలు చేశాడు మహేంద్ర సింగ్ ధోనీ. తాజాగా పూణె నగరంలో మరో ఇంటికి కొన్నాడు మాహీ.
undefined
పూణెలోని పింప్రీ చించావాడ్ ఏరియాలో ఉన్న ఈ ఇంటి ఖరీదు దాదాపు 30 కోట్ల రూపాయలట. దీంతో కలిపి ధోనీకి మొత్తంగా నాలుగు ఇళ్లు ఉన్నాయి. వీటన్నింటి విలువ రూ.110 కోట్లకు పై మాటే.
undefined
ఐపీఎల్ ద్వారా ఏటా రూ.15 కోట్లు అందుకుంటున్న మహేంద్ర సింగ్ ధోనీ, వివిధ ప్రోడక్ట్స్ బ్రాండ్ అంబాసిడింగ్ ద్వారా రూ.150 కోట్ల దాకా ఆర్జిస్తున్నాడు. విరాట్ కోహ్లీ తర్వాత అత్యధిక మొత్తం ఆర్జిస్తున్న క్రికెటర్ ధోనీయే.
undefined
click me!