ఈ ఏడాది జులైలో ఇంగ్లాండ్ తో రీషెడ్యూల్డ్ టెస్టుతో పాటు వన్డేలలో ఆడిన బుమ్రా తర్వాత విశ్రాంతి తీసుకున్నాడు. భారత జట్టు అనంతరం ఆడిన వెస్టిండీస్, జింబాబ్వే సిరీస్ లకు కూడా అతడు అందుబాటులో లేడు. ఆసియా కప్ కు ముందు బీసీసీఐ స్పందిస్తూ.. వెన్నునొప్పి కారణంగా బుమ్రా ఈ టోర్నీలో ఆడటం లేదని.. అతడికి కనీసం రెండు, మూడు నెలలైనా విశ్రాంతి కావాలని చెప్పింది. అయితే ఆసియా కప్ కు దూరమైన అతడిని విశ్రాంతి తీసుకోనీయకుండా ప్రపంచకప్ లో ఆడించాలని సెలక్టర్లు భావించారు.