బోర్డర్ - గవాస్కర్ ట్రోఫీ (బీజీటీ) లో భాగంగా ఫిబ్రవరి 9 నుంచి నాగ్పూర్ వేదికగా తొలి టెస్టు జరుగనున్న విషయం తెలిసిందే. ఈ సిరీస్ ఫలితం ఎలా ఉండబోతుందనే విషయైమ క్రికెట్ విశ్లేషకులు, మాజీలు ఎవరికి తోచిన అభిప్రాయం వారు వ్యక్తం చేస్తున్నారు. తాజాగా శ్రీలంక మాజీ సారథి, గతేడాది ఐపీఎల్ సీజన్ వరకూ ముంబై ఇండియన్స్ హెడ్ కోచ్ గా వ్యవహరించిన మహేళ జయవర్దెనే ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.