మహ్మద్ షమీని ఎందుకు తీసుకోలేదు?
డిసెంబర్ 2022 వరకు మిర్పూర్లో బంగ్లాదేశ్తో జరిగిన రెండో, చివరి టెస్టు ఆడిన కొన్ని రోజుల తర్వాత డిసెంబర్ 30న రోడ్డు ప్రమాదంలో పంత్ గాయపడ్డాడు. దాదాపు సంవత్సరం తర్వాత ఐపీఎల్ తో గ్రౌండ్ లోకి ఎంట్రీ ఇచ్చాడు. ఇప్పుడు టెస్టు జట్టులోకి కూడా వచ్చాడు. ఇక మహ్మద్ షమీ టెస్టు జట్టులో చోటు దక్కించుకోలేకపోయాడు. వన్డే ప్రపంచ కప్ నుంచి షమీ గాయంలో బాధపడుతున్నాడు. ప్రస్తుతం ఎన్సీఏ వైద్యుల పర్యవేక్షణలో ఉన్న అతను ఇంకా పూర్తిగా ఫిట్గా లేడు. చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ గతంలో షమీ ఫిట్నెస్ సాధిస్తాడని ఆశాభావం వ్యక్తం చేసినా అది జరగలేదు.
బంగ్లాదేశ్తో తొలి టెస్టుకు భారత జట్టు
రోహిత్ శర్మ (కెప్టెన్), యశస్వి జైస్వాల్, శుభ్మన్ గిల్, విరాట్ కోహ్లి, కేఎల్ రాహుల్, సర్ఫరాజ్ ఖాన్, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), ధ్రువ్ జురెల్ (వికెట్ కీపర్), రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, మహమ్మద్ సిరాజ్, , జస్ప్రీత్ బుమ్రా, యష్ దయాల్.