దక్షిణాఫ్రికా జట్టు నుంచి రిటైర్ అయ్యాక గ్యారీ భారత జట్టుకు 2008 నుంచి 2011 వరకు హెడ్ కోచ్ గా పనిచేశాడు. అతడి మార్గదర్శకత్వంలోనే భారత జట్టు 28 ఏండ్ల తర్వాత వన్డే ప్రపంచకప్ నెగ్గింది. ఆ తర్వాత గ్యారీ రెండేండ్ల పాటు సౌతాఫ్రికాకు, ఆ తర్వాత పలు ఫ్రాంచైజీలకు హెడ్ కోచ్ గా పనిచేశాడు.