వీరిని తొలగించిన వెంటనే కొత్త సెలక్షన్ కమిటీకి నోటిఫికేషన్ జారీ చేయడం, అభ్యర్థుల నుంచి దరఖాస్తులు స్వీకరించడం, వారిని షార్ట్ లిస్ట్ చేయడం జరిగిపోయింది. అయితే తాజాగా టీమిండియా చీఫ్ సెలక్టర్ విషయంలో బీసీసీఐ యూటర్న్ తీసుకున్నట్టు తెలుస్తున్నది. 2020 నుంచి చీఫ్ సెలక్టర్ గా వ్యవహరిస్తున్న చేతన్ శర్మకే తిరిగి ఆ పగ్గాలు అప్పగించే అవకాశాలు మెండుగా ఉన్నాయి.