ఈసారికి 8 జట్లే... కొత్తగా రెండు ఐపీఎల్ జట్ల కోసం టెండర్లు అప్పుడే... కీలక నిర్ణయాలు తీసుకున్న బీసీసీఐ...
First Published Dec 24, 2020, 6:21 PM ISTఅహ్మదాబాద్లో జరిగిన బీసీసీఐ వార్షిక సమావేశంలో కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంది బీసీసీఐ. వచ్చే ఏడాది భారత్ వేదికగా నిర్వహించబోయే టీ20 వరల్డ్కప్ వేదిక, నిర్వహణలతో పాటు ఐపీఎల్లో అదనపు జట్లను చేర్చే విషయంలో కూడా ఈ సమావేశంలో చర్చించినట్లు టాక్. 2021 సీజన్కి పెద్దగా సమయం లేనందున 2022 సీజన్లో 10 జట్లను ఆడించేందుకు బీసీసీఐ ఏజీఎమ్ (Annual General meeting) అంగీకరించినట్లు సమాచారం.