ఐపీఎల్లో 'ఇంపాక్ట్ ప్లేయర్' నిబంధనను కూడా ముగించాలని బీసీసీఐ నిర్ణయించుకుంటే, అది ధోనీ కెరీర్ ముగింపు రహదారి కావచ్చు. అలాగే, రాబోయే సీజన్లో రూ. 4 కోట్లకు సీఎస్కే తో 'అన్క్యాప్డ్' ఆటగాడిగా సంతకం చేయడానికి ధోనీ అంగీకరిస్తాడో లేదో చూడాలి. అన్ క్యాప్డ్ ప్లేయర్ రూల్ కారణంగా ధోని ఐపీఎల్ లో అందుకునే రూ.12 కోట్లు కాకుండా 4 కోట్ల రూపాయలు మాత్రమే అందుకుంటాడు. ఇలాంటి తరుణంలో ఇంపాక్ట్ ప్లేయర్ రూల్, అన్ క్యాప్డ్ ప్లేయర్ రూల్ ప్రభావం మధ్య ధోని ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది ఆసక్తిని పెంచుతోంది.
ఇదిలావుండగా, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ సహా పలువురు క్రీడాకారులు ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ పై తమ స్పందనలు తెలియజేసిన క్రమంలో.. ఈ ఏడాది మేలో బీసీసీఐ మాజీ సెక్రటరీ, ప్రస్తుత ఐసీసీ చీఫ్ జై షా ఐపీఎల్లో ఈ నిబంధనను 'టెస్ట్ కేసు'గా అభివర్ణించారు. ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ శాశ్వతం కాదనీ, దానిని రద్దు చేస్తామని చెప్పారు. బీసీసీఐ తాజా నిర్ణయాన్ని సౌరాష్ట్ర ప్రధాన కోచ్ నీరజ్ ఒడెద్రా స్వాగతించారు. ఇది మంచి మార్పు అని అన్నారు. ఐసీసీ ప్రధాన టోర్నమెంట్లలో ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ ఉండదు కాబట్టి దేశీయ సీజన్ తర్వాత భారతదేశం కోసం ఆడాలనుకునే క్రికెటర్లకు ఇది నిర్ణయమని ఆయన పేర్కొన్నారు.