భారత క్రికెట్ జట్టులో సువర్ణధ్యాయాలతో లిఖించిదగ్గ అపురూప ఘట్టం 1983 వన్డే వరల్డ్ కప్ విజయం. ఈ విజయం ఇచ్చిన జోష్ తో టీమిండియా క్రికెట్ లో పెను మార్పులు సంభవించాయి. యువతరం క్రికెట్ ను కెరీర్ గా మొదలుపెట్టింది అప్పట్నుంచే.. సచిన్, ద్రావిడ్, గంగూలీ, అజారుద్దీన్ వంటి ఎంతోమంది దిగ్గజాలకు ఆ విజయం స్ఫూర్తినిచ్చింది.