కోహ్లీ, అనుష్క శర్మ ఇంట్లో పనివాళ్లు ఉండరట... షాకింగ్ విషయాలు బయటపెట్టిన మాజీ సెలక్టర్...

First Published Feb 22, 2021, 10:17 AM IST

కాస్తో కూస్తో ఆదాయం సంపాదించేవాళ్లే, ఇంట్లో పనులు చేసుకోలేక పని మనుషులను పెట్టుకుంటూ ఉంటారు. బట్టలు ఉతకడానికి, గిన్నెలు తోమడానికి, ఇళ్లు ఉడిచి, తుడవడానికి పనివాళ్లను నియమించుకుంటూ ఉంటారు. అలాంటి దేశంలోనే అత్యధిక ఆదాయం అందుకునే సెలబ్రిటీ జంట విరాట్ కోహ్లీ, అనుష్క శర్మల ఇంట్లో ఇంకెంత మంది పనివాళ్లు ఉండాలి... అయితే విరుష్క ఇంట్లో పనివాళ్లే ఉండరట...

ప్రస్తుతం ఆసియాలోనే అత్యధిక ఆదాయం ఆర్జిస్తున్న క్రీడాకారుడు టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ. కోహ్లీ ఏటా రూ.600 కోట్లకు పైగా ఆదాయాన్ని గడిస్తున్నాడు...
undefined
ప్రపంచంలోనే అత్యధిక మంది ఫాలోవర్లు కలిగిన నాలుగో క్రీడాకారుడు విరాట్ కోహ్లీ. ఫుట్‌బాల్ లెజెండరీ స్టార్లు క్రిస్టియానో రొనాల్డో, మెస్సీ, నేమర్ మాత్రమే కోహ్లీ కంటే ముందున్నారు...
undefined
సోషల్ మీడియాలో దాదాపు 100 మిలియన్లు (97.8 మిలియన్లు) ఫాలోవర్లు కలిగిన విరాట్ కోహ్లీ, ఒక్కో ట్వీట్, ఒక్కో ఇన్‌స్టాగ్రామ్ పోస్టు ద్వారా కోట్ల రూపాయలు ఆర్జిస్తున్నాడు...
undefined
అయితే ఫిట్‌నెస్‌కి ప్రాధాన్యం ఇచ్చే విరుష్క జోడి, తమ ఇంట్లో పనులను తామే చేసుకోవడానికి ప్రాధాన్యం ఇస్తారట. అందుకే విరాట్ కోహ్లీ ఇంట్లో పనివాళ్లే ఉండరని షాకింగ్ విషయాన్ని వెల్లడించాడు బీసీసీఐ మాజీ సెలక్టర్ శరణ్‌దీప్ సింగ్...
undefined
‘క్రీజులోకి దిగాక చాలా అగ్రెసివ్‌గా మారిపోయే విరాట్ కోహ్లీ, మైదానం బయట మాత్రం చాలా కూల్‌ పర్సన్... విరాట్ కోహ్లీ, అనుష్క శర్మ ఉండే ఉంట్లో అస్సలు పనివాళ్లే ఉండరు...
undefined
కోహ్లీ ఇంటికి వెళ్లినప్పుడు విరాట్, ఆయన భార్య అనుష్క కలిసి భోజనం వడ్డించారు... ఇంటికి ఎవ్వరు వచ్చినా, మనతో కూర్చొన్ని ఓపిగ్గా మాట్లాడతాడు...
undefined
అవసరమైతే మనతో కలిసి బయటికి విందుకు కూడా వస్తాడు.. అందుకేనేమో మిగిలిన ప్లేయర్లకు విరాట్ కోహ్లీ అంటే ఎంతో గౌరవం...
undefined
ఎంత ఎత్తుకు ఎదిగినా ఒదిగి ఉండే మనస్తత్వం అందరికీ ఉండదు... విరాట్ కోహ్లీ అందులో ఎప్పుడో ఓ ఎత్తుకు ఎదిగిపోయాడు...’ అంటూ చెప్పుకొచ్చాడు శరణ్‌దీప్ సింగ్...
undefined
ఆస్ట్రేలియా యంగ్ స్పిన్నర్ ఆడమ్ జంపాతో పాటు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు సభ్యులు చాలామంది విరాట్ కోహ్లీ కూల్ యాటిట్యూడ్ గురించి చాలా సార్లు చెప్పిన విషయం తెలిసిందే...
undefined
click me!